1802 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- ఏప్రిల్ 10: భారతదేశంలో గ్రేట్ ట్రిగనామెట్రిక్ సర్వే మొదలైంది
- మే 20: ఫ్రెంచి విప్లవ సమయంలో రద్దు చేసిన బానిసత్వాన్ని నెపోలియన్ తిరిగి ప్రవేశపెట్టాడు.
- మే: మేడం టస్సాడ్ తన మైనపు బొమ్మలను లండన్లో తొలిసారి ప్రదర్శించింది.
- జూలై 22: గియా లాంగ్ హనోయిని ఆక్రమించాడు. దాంతో వియత్నాం ఏకీకరణ పూర్తైంది.
- తేదీ తెలియదు: రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు బొబ్బిలి సంస్థానాధీశుడయ్యాడు
- తేదీ తెలియదు: నూజివీడు ఎస్టేటును నిడదవోలు, నూజివీడు అనే రెండు ఎస్టేట్లుగా విభజించారు.