ఫిబ్రవరి 25 - పదేపదే కాల్చగల కోల్ట్ రివాల్వర్కు అమెరికా పేటెంట్ ఇచ్చింది.
జూలై 20 - చార్లెస్ డార్విన్ అసెన్షన్ ద్వీపంలోని గ్రీన్ హిల్ ఎక్కాడు.
ఆగస్టు 17 - చార్లెస్ డార్విన్ను మోసుకెళ్ళిన హెచ్ఎంఎస్. బీగల్ ఓడ దక్షిణ అమెరికా నుండి బయలుదేరి ఇంగ్లాండ్కు తిరుగు ప్రయాణం ప్రారంభించింది.
సెప్టెంబర్ 1 - జెరూసలెంలో రబ్బీ యూదా హజీద్ సినగోగ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది.
తేదీ తెలియదు: అస్సామీ భాషలో 1836 లో మొట్టమొదటి అచ్చు యంత్రాన్ని సిబసాగర్ లో స్థాపించారు.
అక్టోబరు 2 - చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించడానికి అవసరమైన జీవ సమాచారాన్ని సేకరించి, హెచ్ఎంఎస్. బీగల్ ఓడపై బ్రిటన్ చేరుకున్నాడు. తన పరిణామ సిద్ధాంతాన్ని కూర్చేందుకు ఈ సమాచారం అతడికి ఉపయోగపడింది.
డిసెంబరు 30 – రష్యా లోని సెయింట్ పీటర్స్బర్గ్ లో లేమాన్ థియేటరు తగలబడి 800 మంది చనిపోయారు.