1813 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
జనవరి 24 :లండన్లో ఫిలార్మోనిక్ సొసైటీని స్థాపించారు. తరువాత ఇదే రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీగా మారింది.
జనవరి 28 : జేన్ ఆస్టిన్ రాసిన ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ ను తన పేరు లేకుండా ప్రచురించింది.
మార్చి 4 : ఫ్రెంచి సైన్యం బెర్లిన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో రష్యా సేనలు యుద్ధం చెయ్యకుండానే నగరాన్ని ఆక్రమించాయి
మార్చి 28 : 1813-14 నాటి మాల్టా ప్లేగు మహమ్మారి ఏజిప్టు నుండి వ్యాపించడం మొదలైంది
జూలై 21: బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ చట్టము 1813 కి రాజముద్ర పడింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మతప్రచారం చేసుకోవచ్చని ఈ చట్టం అనుమతించింది.
సెప్టెంబరు 10 : ఆలివర్ హజార్డ్ పెర్రీ నేతృత్వంలోని అమెరికన్ స్క్వాడ్రను బ్రిటిషు స్క్వాడ్రన్ను ఓడించింది.
అక్టోబరు 4 : హేస్టింగ్సు భారత గవర్నరు జనరల్ అయ్యాడు. (విరమణ. 1823 )
అక్టోబరు 16-19: లీప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ సంకీర్ణ సైన్యాల చేతిలో ఓడిపోయాడు. యుద్ధంలో పాల్గొన్న 6 లక్షల మంది సైనికుల్లో 60 వేల మంది మరణించడమో, గాయపడ్డమో జరిగింది. ఈ యుద్ధం తరువాత నెపోలియన్ పక్షాన ఉన్న అనేక జర్మను రాజ్యాలు సంకీర్ణ సైన్యాల వైపుకు మారిపోయాయి.
తేదీ తెలియదు: షాజహాన్పూర్ జిల్లాను ఏర్పరచారు.
తేదీ తెలియదు: ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపత్యం స్వీకరించాడు.
Swathi Thirunal of Travancore