1817 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
జనవరి 20 : రామ మోహన్ రాయ్, డేవిడ్ హేర్ లు కలకత్తాలో హిందూ కాలేజిని స్థాపించారు.
జూన్ 12 : జర్మనీకి చెందిన కార్ల్ డ్రైస్ తొలి రూపపు సైకిలును తయారు చేసాడు.
సెప్టెంబరు 11 : సిలోన్లో 1817-18 తిరుగుబాటు మొదలైంది.
అక్టోబరు 17 : బాంబేలో హెచ్ఎమ్ఎస్ ట్రింకోమలీ ఫ్రిగేట్ను తయారు చేసారు. రెండు శతాబ్దాల తరువాత కూడా అది నీటిలో తేలే స్థితిలోనే ఉంది.
అక్టోబరు 30 : సైమన్ బొలివర్ వెనెజులాలో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు.
అక్టోబరు 31 : జపాన్లో నిన్కో చక్రవర్తి గద్దెనెక్కాడు
నవంబరు 5 : మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మొదలైంది
నవంబరు 17 : బ్రిటిషు వారు పూనాను స్వాధీనం చేసుకున్నారు .
తేదీ తెలియదు: బెంగాల్లో కలరా అంటువ్యాధి మొదలైంది. సెప్టెంబరు నాటికి ఇది కలకత్తాకు పాకింది.
తేదీ తెలియదు: బెంగాల్లో శ్రీరాంపూర్ కళాశాలను స్థాపించారు
తేదీ తెలియదు: శృంగేరి శారదా పీఠపు 32 వ జగద్గురువు 8 వ నృసింహ భారతి పీఠాన్ని అధిరోహించాడు. Mangalagiri temple .. raja venktadri naidu. తేదీ వివరాలు తెలియనివి[ మార్చు ] తరిగొండ వెంగమాంబ , 18వ శతాబ్దికి చెందిన భక్త కవయిత్రి, మహా యోగిని, శ్రీవేంకటేశ్వరుని భక్తురాలు. (జ.1730)