జనవరి 29: థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
ఏప్రిల్ 6 – జూన్ 21: బానసలను తీఓసుకెళ్ళే ఫ్రెంచి ఓడ లే రెడ్యూర్ పశ్చిమ ఆఫ్రికా నుండి గ్వాడలోప్ కు ప్రయాణం చేస్తూండగా ఓడలో బానిసలు చాలామందికి కళ్ళు పోయాయి. 30 మంది బానిసలను సముద్రం లోకి తోసేసారు.[1]
మే 22: ఎస్ఎస్ సవానా ఓడ అమెరికా లోని జార్జియా నుండి బయలుదేరి జూన్ 20న ఇంగ్లాండు చేరింది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటిన తొలి ఆవిరి ఓడ ఇది.
జూన్ 16: కచ్ రాన్ భూకంపంలో 1,543 మంది మరణించారు. ఈ భుకంపం వలన భూమి పైకి ఉబికి వచ్చి, 80 -150 కి.మీ.. పొడవైన 6 మీ. ఎత్తున్న కట్ట ఏర్పడింది. దీన్ని అల్లా బండ్ (దేవుడి ఆనకట్ట) అంటారు.
జూలై 1: జర్మను ఖగోళవేత్త యోహన్ జార్జ్ ట్రాలెస్, గ్రేట్ కామెట్ ఆఫ్ 1819 తోకచుక్కను కనుగొన్నాడు.[2]