జూలై 4: 50 నక్షత్రాల అమెరికా జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. 1912 నుంచి 1959 వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు ఛేదించబడింది.
జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపికైంది.
జూలై 28: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్వ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి, ముదిగొండలో ఏడుగురు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఆగష్టు 17: దశరథ్ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్గా పేరు పొందిన సామాన్యవ్యక్తి.
సెప్టెంబర్ 4: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత. (జ.1929)