జనవరి 17 - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్చంతంచేసుకున్న జ్యోతిబసు. (జ. 1914)
జూలై 3: ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయంలో 9000 కోట్ల రూపాయల్ పెట్టుబడితో నిర్మించిన 3వ టెర్మినల్ (టీ3)ను ప్రారంభించారు.
జూలై 3: కిర్గిస్తాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఒటుంబయెవా (మధ్య ఆసియాలో అధ్యక్షురాలి హోదా చేపట్టిన తొలి మహిళ).
జూలై 5: శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా 3 రోజుల పాటు, ఆ ఉత్సవాన్ని జరుపుతుంది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
జూలై 5: ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు 'భారత్ బంద్'ని నిర్వహించాయి.
జూలై 27: ఒక్క తిండి గింజ కూడా వృధా చేసినా నేరమే అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది. తిండి గింజలను కుళ్ళబెట్టే బదులు పేదలకు ఇవ్వవచ్చుకదా అన్నది. బీదరికంలో లేని వారికి తిండి గింజలలో రాయితీలు ఎందుకు అన్నది.
జూలై 28: పాకిస్తాన్లో ఇస్లామాబాద్ సమీపంలోని కోడప్రంతంలో ఉదయం పది తంటల సమయంలో కోడను ఢీకొని పేలిపోయింది. 155మంది సిబ్బందితో సహా మరణించారు.
జూలై 28: 22 లేదా 23 ఆగష్టు నెలలో ఇంజినీరింగ్ కౌన్సెలింగు జరుగుతుంది అన్నారు.
జూలై 28: ప్రధాన ఎన్నికల కమిషనరుగా (సీ.ఈ.సీ)గా షాహాబుద్దీన్ యాకుబ్ ఖురేషీని నియమించారు. ప్రస్తుతమున్న నవీన్ చావ్లా 2010 జూలై 29 గురువారం పదవీ విరమణ చేస్తాడు. 63 సంవత్సరాల వయసు ఉన్న ఖురేషీ రెందు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతాడు.
జూలై 30: 12 శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి 11 స్థానాలలో, భారతీయ జనతా పార్టీ 1 స్థానం (నిజామాబాద్ అర్బన్ ) గెలుచుకున్నాయి. నియోజక వర్గాలు : 1.సిర్పూరు, 2.చెన్నూరు, 3.మంచిర్యాల, 4.నిజామాబాద్ అర్బన్ (బా.జ.పా), 5.ధర్మపురి, 6.వేములవాడ, 7. సిద్ధిపేట, 8.వరంగల్ (పశ్చిమ), 9. హుజూరాబాద్, 10.సిరిసిల్ల, 11.కోరుట్ల, 12.ఎల్లారెడ్డి.
జూలై 30 : శ్రీకృష్ణ దేవరాయలు, సింహాచలం అప్పన్నకు ఇచ్చిన 16 బంగారు అభరణాలను, ప్రజలు చూడటానికి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య, ప్రదర్శనకు పెట్టారు.