జనవరి 5: ఉభాషి ఖాన్ నేతృత్వంలో, దిగువ వోల్గా నది తూర్పు ఒడ్డు నుండి తిరిగి మాతృభూమి అయిన డున్గారియాకు గ్రేట్ కల్మిక్ ( టోర్గట్ ) వలస సాగింది. క్వింగ్ రాజవంశం పాలనలో ఇది జరిగింది.
జనవరి 9: చక్రవర్తి గో-మోమోజోనో తన అత్త పదవీ విరమణ తరువాత జపాన్ సింహాసనం పొందాడు.
ఫిబ్రవరి 12: అడాల్ఫ్ ఫ్రెడరిక్ మరణం తరువాత, అతని కుమారుడు గుస్తావ్ III స్వీడన్ రాజుగా నియమితుడయ్యాడు. అయితే, ఆ సమయంలో గుస్తావ్ పారిస్లో ఉన్నందున ఈ విషయం తెలియదు. తన తండ్రి మరణ వార్త ఒక నెల తరువాత అతనికి చేరింది.
ఏప్రిల్ 4: బుబోనిక్ ప్లేగుతో పోరాడటానికి మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్లలో మొదటి క్వారంటైన్ మొదలైంది. ఆ తరువాతి 12 నెలల్లో, ఒక్క మాస్కోలోనే 52,000 మందికి పైగా ప్రజలు ప్లేగు వ్యాధితో మరణించారు.[1]
జూలై 12: హెచ్ఎంఎస్ ఎండీవర్ దాదాపు మూడేళ్ల తర్వాత ఇంగ్లాండ్కు తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కుక్ చేసిన మొదటి సముద్రయానం ముగిసింది.
ఆగస్టు 8: ఇంగ్లండ్లోని హోర్షామ్లో మొదటి టౌన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది.[2]
నవంబర్ 16 – రాత్రి సమయంలో ఇంగ్లాండ్ లోని టైన్ నదికి వరదలు వచ్చి అనేక వంతెనలు నాశనమయ్యాయి. చాలా మంది మరణించారు; న్యూకాజిల్ అపాన్ టైన్ వద్ద కట్టిన ప్రధాన వంతెన 1781లో గానీ పూర్తికాలేదు.